న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనవడం పట్ల కాంగ్రెస్ స్పందించింది. ప్రధాని మోదీ సినిమాల్లో నటించాలని ఆ పార్టీ ప్రతినిధి పవన్ ఖేరా ఎద్దేవా చేశారు. గుజరాత్ లో మోదీ సీఎంగా ఉన్నప్పటి రోజులనుంచి ఆయనను తెలిసిన వారు మోదీ రాజకీయాల్లో లేకుంటే సినిమాల్లో ఉండేవారని చెబుతుంటారని ఆయన పేర్కొన్నారు.
ఆయన రాజకీయాల్లో ఉండటంతో దేశానికి నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాని మోదీ ఇలాంటి నాటకాలను కట్టిపెట్టాలని ఆర్జేడీ వ్యాఖ్యానించింది. కరోనా మహమ్మారితో దేశంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ఎన్నికల ప్రచారంలో మునిగితేలిన మోదీ ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని పేర్కొంది.