న్యూఢిల్లీ: డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ బైజూస్ ఉన్నత విద్యా రంగంలోకి అడుగు పెడుతున్నది. ఇందుకోసం గ్రేట్ లెర్నింగ్ యాప్ను టేకోవర్ చేసింది. ఇంతకుముందు స్కూల్ లెర్నింగ్ యాప్ తొప్పార్ను కైవశం చేసుకున్నది బైజూస్. అమెరికా కేంద్రంగా పని చేస్తున్న పిల్లల ఆన్లైన్ రీడింగ్ ప్లాట్ఫామ్ ఎపిక్ను 500 మిలియన్ల డాలర్లకు టేకోవర్ చేసిన వారం లోపు గ్రేట్ లెర్నింగ్ను స్వాధీనం చేసుకున్నది.
ఈ ఏడాది ఏప్రిల్లో దేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సంస్థ.. ఆకాశ్ను 100 కోట్ల డాలర్లకు బైజూస్ టేకోవర్ చేసింది. తాజాగా గ్రేట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ను స్వాధీనం చేసుకోవడానికి బైజూస్ 600 మిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది. తొప్పార్ కొనుగోలుకు 150 మిలియన్ల డాలర్లు వెచ్చించింది.
తాజా రెండు టేకోవర్లలో 2021లో భారత్, అమెరికాలో ఆరు స్టార్టప్ సంస్థలను బైజూస్ స్వాధీనం చేసుకున్నది. ఎడ్యుకేషన్, టెక్నాలజీ లెర్నింగ్ రంగాల్లోకి ఎంటరయ్యేందుకు బైజూస్ ఈ ఏడాది ఇప్పటి వరకు 200 కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టింది.
గ్రేట్ లెర్నింగ్ టేకోవర్తో అప్ స్కిలింగ్, రీస్కిలింగ్ సెగ్మెంట్లోకి బైజూస్ అడుగు పెట్టినట్లయింది. హయ్యర్ లెర్నింగ్ డిగ్రీ, డిప్లమా, సర్టిఫికెట్ కోర్సులను గ్రేట్ లెర్నింగ్ అందజేస్తుంది. డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి టూల్స్లో గ్రేట్ లెర్నింగ్ శిక్షణనిస్తుంది.