కోనారావుపేట/సిరిసిల్ల : విద్యుత్ షాక్తో ఓ రైతు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన జిల్లాలోని కోనారావుపేట మండలం ధర్మారం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీరాముల లక్ష్మీరాజం (60) అనే రైతు పంట పొలానికి నీటిని పారించడానికి వెళ్లాడు. ఈ క్రమంలో నీటిలో ఉన్న విద్యుత్ తీగలు కాలికి తగిలి విద్యుత్ షాక్కు గురయ్యాడు. దీంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.