బ్రిస్టల్: ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ ఏడేళ్ల తర్వాత తొలి టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. ఇంగ్లండ్తో జరగనున్న ఈ మ్యాచ్లో మిథాలీ సేన ముందు ఫీల్డింగ్ చేయనుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. పవర్హిట్టర్ షెఫాలీ వర్మ ఈ మ్యాచ్తో టెస్ట్ అరంగేట్రం చేస్తోందని టాస్ సందర్భంగా కెప్టెన్ మిథాలీ రాజ్ చెప్పింది. అయితే ఆమెను ఏస్థానంలో ఆడించాలో ఇంకా నిర్ణయించలేదని తెలిపింది.
టాస్ గెలిస్తే తాము కూడా మొదట బ్యాటింగ్ చేసేవాళ్లమని చెప్పింది. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగుతోంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ టెస్ట్ ఆడుతుండటం తమకు ఓ సవాలే అని, టీమ్లోని సీనియర్లు యువ ప్లేయర్స్ను గైడ్ చేస్తున్నట్లు మిథాలీ చెప్పింది. ఇంగ్లండ్ టూర్లో భాగంగా ఈ ఏకైక టెస్ట్తోపాటు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్లలో కూడా ఇండియన్ వుమెన్స్ టీమ్ తలపడబోతోంది.