న్యూఢిల్లీ, జూలై 27: దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థయైన ఇండిగో గత త్రైమాసికంలో ఏకంగా రూ.3,174 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,844 కోట్ల నష్టంతో పోలిస్తే భారీగా పెరిగింది. అయినప్పటికీ ఆదాయం మాత్రం 177.20 శాతం ఎగబాకి రూ.3,170 కోట్లకు చేరుకున్నట్లు ఒక ప్రకటనలలో వెల్లడించింది.