ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రసిద్ధ తాజ్ హోటల్లోకి గన్స్తో ఇద్దరు ప్రవేశించబోతున్నట్లు వచ్చిన ఒక ఫోన్ కాల్ కలకం రేపింది. దీంతో హోటల్ నిర్వాహకులతోపాటు పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. హోటల్ అంతా తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా ఏమీ గుర్తించలేకపోయారు. చివరకు ఆ ఫోన్ కాల్ను ఒక బాలుడు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీని గురించి అతడి తండ్రిని ఆరా తీశారు. భయపడాల్సిన అవసరం లేదని ముంబై పోలీసులు తెలిపారు. తాజ్ హోటల్లో కలకలం రేపిన ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.