న్యూఢిల్లీ, ఆగస్టు 26: కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఆందోళణ బాటపట్టారు. 2.86 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ను నగదీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉద్యోగులు నిరసన చేయనున్నట్లు ప్రకటించారు. భారత్నెట్ ప్రాజెక్టులో భాగంగా బీఎస్ఎన్ఎల్,ఎంటీఎన్ఎల్లకు సంయుక్తంగా 14,917 టవర్లు ఉన్నాయి. ఈ మొబైల్ టవర్ల వ్యాపారాన్ని ప్రైవేట్పరం చేసే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రకటించింది. దీనికి వ్యతిరేకంగా శుక్రవారం దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల వద్ద ఆందోళన చేయనున్నట్లు తెలిపారు. భారత్ నెట్ ఫైబర్ ఆస్తులు, 15 వేల టవర్లను నగదీకరణ చేయడం ద్వారా రూ.35,100 కోట్ల నగదు రావచ్చునని కేంద్రం అంచనావేస్తున్నది.
నరేంద్ర మోదీ సర్కార్పై ఉద్యోగ సంఘాలు విమర్శలు గుప్పించారు. బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసులు ప్రారంభించిన రెండేండ్లు అయినప్పటికీ పూర్తి స్థాయిలో స్పెక్ట్రం కేటాయించడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ మొబైల్ టవర్లు, వ్యాపారాన్ని అమ్మేయాలనే ఉద్దేశంతో సర్కార్ చర్యలు తీసుకోవడం లేదని వారు దుయ్యబట్టారు. తర్వాతి క్రమంలో 7 లక్షల కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ను సైతం విక్రయించేయోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తున్నది.