హుజూర్నగర్, జూలై 8 : హుజూర్నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి పనులు సంబురంగా జరుగుతున్నాయి. 7వ విడుత హరితహారంలో భాగంగా మొక్కలు నాటే పనులు కొనసాగుతున్నాయి. హుజూర్నగర్ మున్సిపాలిటీలోని 18, 19వ వార్డుల్లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మొక్కలు నాటి పంపిణీ చేశారు. మండలంలోని లింగగిరి గ్రామంలో ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ ఇంటికి ఆరు మొక్కల చొప్పున ప్రజలకు పంపిణీ చేశారు. గ్రామంలో ఏర్పాటుచేయనున్న మెగా పల్లె ప్రకృతి వనం స్థలాన్ని జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి పరిశీలించారు. అనంతరం గ్రామంలోని పల్లెప్రకృతి వనం, పల్లె ప్రగతి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
మేళ్లచెర్వు : మండలంలోని కందిబండ, నల్లబండగూడెం గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పల్లె ప్రగతి పనులను పరిశీలించారు.
పాలకవీడు మండలం హనుమయ్యగూడెంలో పాత విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేశారు. మీగడంపహాడ్ తండా, రావిపాడులో పిచ్చి మొక్కలను తొలగించారు. మఠంపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో ఎంపీడీఓలు వరప్రసాద్, జానకిరాములు, ఇసాక్ హుస్సేన్, ఎంపీపీ కొట్టె పద్మాసైదేశ్వర్రావు, సర్పంచులు అంజిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సరిత, కృష్ణారెడ్డి, రాంబాబు, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, నాయకులు ఇంద్రారెడ్డి, రవినాయక్, కోటిరెడ్డి పాల్గొన్నారు.
కోదాడ నియోజకవర్గంలో..
కోదాడ : నియోజకవర్గ వ్యాప్తంగా పల్లె, ప్రగతి పనులు జోరుగా సాగుతున్నాయి. కోదాడ పట్టణంలోని 8, 26వ వార్డుల్లో పట్టణ ప్రగతి పనులను మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ పరిశీలించారు. అలాగే 31వ వార్డులో మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న యాద ఉపేందర్-భవానీరాణి, కిశోర్-పద్మ దంపతులను ఆమె సన్మానించారు. ఆమె వెంట వార్డు కౌన్సిలర్ ఫాతిమా ఖాజా మొహీనుద్దీన్, మున్సిపల్ శానిటరీ అధికారి యాదగిరి ఉన్నారు. మండలంలోని గుడిబండలో జరిగిన పల్లె ప్రగతిలో ఎంపీపీ చింతా కవితారెడ్డి, ఆర్డీఓ కిశోర్కుమార్ పాల్గొని ప్రభుత్వ పాఠశాలల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. అనంతరం వారు మాట్లాడుతూ పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు.
గుండు సురేశ్, ఓరుగంటి శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి ఫాతిమా పాల్గొన్నారు. మునగాల మండలంలోని కోదండరామాపురంలో పల్లెప్రగతి పనులను కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి పరిశీలించారు. డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించి పనులను నిర్లక్ష్యం చేయకుండా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. భల్లుతండా, బీక్యాతండాల్లో పల్లె ప్రగతి పనులను క్వాలిటీ కంట్రోల్ డీఈ చక్రవర్తి పరిశీలించారు. సర్పంచులు బానోతు ఝాన్సీబాబూనాయక్, భూక్యా గాంధీనాయక్, ఈసీ శ్రీనివాస్, టీఏ ఉమ్లానాయక్, కార్యదర్శులు పాల్గొన్నారు. నడిగూడెం మండలం నారాయణపురం గ్రామంలో ఏర్పాటు చేస్తున్న మెగా పల్లె ప్రకృతి వనాన్ని జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి పరిశీలించారు. అనంతగిరి మండల వ్యాప్తంగా జరిగిన పనులను ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కొణతం ఉమాశ్రీనివాస్రెడ్డి, డీఎల్పీఓ శ్రీరాములు, ఎంపీడీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.