ముంబై: బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఐ) ఇండెక్స్ సెన్సెక్స్లో గత వారం రిలయన్స్ షేర్ రూ.60 వేల కోట్లు పెరిగింది. గత వారం ట్రేడింగ్లో టాప్-10 కంపెనీల్లో ఏడింటి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.15 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈ-30 ఇండెక్స్లో రిలయన్స్ షేర్ 1.31 శాతం పెరిగి 677.17 పాయింట్లు లబ్ధి పొందింది.
గత వారం రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.60,668.47 కోట్లు పెరిగింది. దీంతో రిలయన్స్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,88,718.41 కోట్లకు పెరిగింది. ఇక బజాజ్ ఫైనాన్స్ ఎం క్యాప్ రూ.23,178.02 కోట్లు పెరిగి రూ.3,61,767.29 కోట్లకు చేరుకున్నది.
ఇక హోం లోన్ లెండర్ హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటల్ రూ.14,521.98 కోట్లు పెరిగింది. దీంతో హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.4,72,940.60 కోట్లకు పెరిగింది.
కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,307.93 కోట్లు పెరిగింది. దీంతో బ్యాంక్ మొత్తం ఎం-క్యాప్ రూ.3,86,971.16 కోట్ల వద్ద స్థిరపడింది. హిందూస్థాన్ యూనీ లివర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,328.97 కోట్లు పెరిగి రూ.5,50,191.47 కోట్లకు చేరుకున్నది.
కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎం-క్యాప్ రూ.2,002.21 పెరిగి, మొత్తం రూ.3,58,851.88 కోట్లతో స్థిరపడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.791.24 కోట్లు పెరిగి రూ.8,28,341.24 కోట్ల వద్దకు చేరింది.
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పతనమైంది. రూ.8,351.83 కోట్లు పడిపోయింది. దీంతో మొత్తం సంస్థ ఎం-క్యాప్ రూ.5,90,252.27 కోట్లకు పతనమైంది.
మరో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం-క్యాప్ రూ.351.41 కోట్లు తగ్గి రూ.11,62,667.33 కోట్ల స్థిర పడింది. ఇక ప్రైవేట్ బ్యాంకర్ ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.208.16 కోట్లు పతనమై రూ. 4,44,963.18 కోట్ల వద్ద నిలిచింది.
బీఎస్ఈ-30 ఇండెక్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్లో నిలిచింది. తదుపరి స్థానాల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్ నిలిచాయి.
చరిత్రలో ఈరోజు.. భాగమతి నదిలో రైలు దుర్ఘటనకు 40 ఏండ్లు
రూ.78 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
స్పేస్స్టేషన్కు వెళ్తూ పగటి పూట స్పష్టంగా కనిపించిన స్పేస్క్రాఫ్ట్.. వీడియో
అందుకే వారు తెల్లారేసరికి కోటీశ్వరులు..ఎలాగంటే
జొమాటో టార్గెట్: 9 ఏండ్లలో పూర్తిగా విద్యుత్ వాహనాలవైపు!!
త్వరలో విపణిలోకి జియో 5జీ ఫోన్.. ధరెంతంటే?!
డిసెంబర్కల్లా రూ.60 వేలకు బంగారం?!
వృద్ధుల కోసం స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్లు..!!
ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ చార్జీలు.. ఏ బ్యాంకులో ఎంత అంటే …?
ఎస్బీఐ కస్టమర్లకు గమనిక.. ఆ పత్రాలు సమర్పిస్తేనే సేవలు
జూన్ 30 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ను పొడిగించిన పేటీఎం…
చికిత్స కోసమే ఇండియా వదిలాను.. నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని!
ఇమ్రాన్ మాట : భారత్తో చర్చలకు సిద్ధమే, కానీ..