హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని కోర్సుల పరీక్షలు యధాతథంగా నిర్వహించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే పీజీ, ఇంజినీరింగ్ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయని, బుధవారం నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు సైతం ప్రారంభం కానున్నాయని చెప్పారు. అవన్నీ ఇంతకుముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని పేర్కొన్నారు.
జేఎన్టీయూ పరిధిలో కూడా పరీక్షలు యథాతథంగా జరగనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. కొవిడ్ వల్ల పరీక్షలు రాయలేని వారికి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రత్యేక పరీక్షను రెగ్యులర్గానే పరిగణిస్తామన్నారు.