కొల్కతా, ఆగస్టు 3: పెరుగుతున్న వ్యయాల్ని తట్టుకునేందుకు తమ ఉత్పత్తుల ధరల్ని పెంచనున్నట్లు బిస్కెట్ల తయారీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ మంగళవారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ముడిపదార్థాల ధరలు భారీగా పెరిగాయని, ఈ కారణంగా బిస్కెట్ల ధరల్ని క్రమేపీ పెంచాలని భావిస్తున్నట్లు బ్రిటానియా మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెర్రీ చెప్పారు. జూన్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికరలాభం 29 శాతం క్షీణించి రూ. 389 కోట్లకు తగ్గింది.