హైదరాబాద్, ఆగస్టు 30: స్మార్ట్ డిజైన్తో కొత్తగా పలు కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్ని బీపీఎల్ విడుదల చేసింది. ఫైటెక్ ఫిల్ట్రేషన్తో ఏసీలను, యాంటీ బాక్టీరియల్ యాంటీ డస్ట్ డెకొరేటివ్ ఫ్యాన్లను మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు బీపీఎల్ ప్రకటన తెలిపింది. అలాగే నేచర్ ఫ్రెష్ టెక్నాలజీతో రిఫ్రిజిటేర్లు సైతం వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. 4కే ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలు, తక్కువ నీటిని వినియోగిస్తూ ఇంధన పొదుపునకు తోడ్పడే వాషింగ్ మెషిన్లను మార్కెట్లోకి విడుదలచేసినట్లు తెలిపింది. బీపీఎల్ ఆడియో పరికరాల శ్రేణితో పాటు కిచెన్, గృహోపకరణాలు, వ్యక్తిగత సంరక్షణ కోసం ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తదితరాలు దేశవ్యాప్తంగా పలు ఎలక్ట్రానిక్, రిటైల్ దుకాణాల్లో అందుబాటులో ఉంటాయని కంపెనీ వివరించింది.