న్యూఢిల్లీ, జూలై 12: విద్యుత్ ఆధారిత వాహనాల తయారీ సంస్థ రెవోల్ట్ మోటర్స్.. తమ ప్రతిష్ఠాత్మక ఎలక్ట్రిక్ మోటర్సైకిల్ ఆర్వీ400 బుకింగ్స్ను మళ్లీ అందుబాటులోకి తెస్తున్నది. హైదరాబాద్సహా దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో ఈ నెల 15 నుంచి బుకింగ్స్ మొదలవుతాయని సోమవారం సంస్థ తెలియజేసింది. సెప్టెంబర్ నుంచి బైక్లను అందించనున్నది.