పీఎస్యూ బ్యాంకుల ప్రైవేటీకరణ : బీఓఎం, ఐఓబీ, బీఓఐ, సెంట్రల్ బ్యాంక్లు ఖరారు!

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వేగవంతం చేసిన ప్రభుత్వం ఈ దిశగా నాలుగు పీఎస్యూ బ్యాంక్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం), బ్యాంక్ ఆప్ ఇండియా (బీఓఐ), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ), సెంట్రల్ బ్యాంక్ల పేర్లను ఈ జాబితాలో కుదించినట్టు ప్రభుత్వ వర్గాలు సంకేతాలు పంపాయి. ఏప్రిల్తో ప్రారంభమయ్యే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ నాలుగు బ్యాంకుల్లో అమ్మకానికి పెట్టే రెండు బ్యాంకులను ఎంపిక చేస్తారని అధికారులు పేర్కొన్నారు.
ప్రయోగాత్మకంగా ప్రభుత్వం తొలిదశలో మధ్య చిన్న తరహా బ్యాంకుల ప్రైవేటీకరణను చేపట్టనుంది. రాబోయే సంవత్సరాల్లో దేశంలో అతిపెద్ద పీఎస్యూ బ్యాంకుల ప్రైవేటీకరణకూ ప్రభుత్వం సన్నద్ధమవుతుందని తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై వ్యాఖ్యానించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి నిరాకరించారు. మరోవైపు బ్యాంకుల ప్రైవేటీకరణ, బీమా రంగంలో ప్రభుత్వ వాటాల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు, ఉద్యోగులు సోమవారం నుంచి రెండు రోజుల సమ్మె చేపట్టారు.
తాజావార్తలు
- అమితాబ్ ఆరోగ్యంపై తాజా అప్డేట్..!
- స్వదస్తూరితో బిగ్ బాస్ బ్యూటీకు పవన్ సందేశం..!
- ఉపాధి హామీ పనులకు జియో ట్యాగింగ్
- 21 రోజులపాటు మేడారం ఆలయం మూసివేత
- మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- రేయ్ రేయ్ రేయ్.. ‘అల్లరి నరేష్’ పేరు మార్చేయ్ ..
- పూరీ వారసుడు ఈ సారైన హిట్ కొడతాడా..!
- కరోనా టీకా తీసుకున్న ప్రధాని మోదీ
- తెలుగు ఇండస్ట్రీలో విషాదం.. యువ నిర్మాత కన్నుమూత
- మన వ్యాక్సిన్ సురక్షితమైంది: హీరో సందీప్కిషన్