హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. సోమవారం 68,171 కరోనా పరీక్షలు చేయగా.. 412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాల్లోనూ కొత్త కేసులు పెరుగుతున్నాయి. చాలారోజుల తర్వాత మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలోలో 103 కరోనా కేసులు నమోదయ్యాయి. నిర్మల్లో 32, మేడ్చల్ మల్కాజిగిరిలో 31, రంగారెడ్డిలో 27, కరీంనగర్లో 12, వరంగల్ అర్బన్లో 12 కేసులు నమోదైనట్టు బులెటిన్లో వైద్యారోగ్యశాఖ వెల్లడించిం ది. జగిత్యాల జిల్లా మేడిపల్లిలోని కేజీబీవీలోని 19 మంది విద్యార్థినులకు కరోనా వచ్చింది.