నాసిక్: కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు శ్రీధర్ దేశ్పాండే (82) అనారోగ్యంతో మృతిచెందారు. మహారాష్ట్రలోని నాసిక్ పట్టణానికి చెందిన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన నాసిక్లోని తన నివాసంలో భార్య, కొడుకు, కోడలు, ఇద్దరు మనుమలతో కలిసి ఉంటున్నారు.
శ్రీధర్ దేశ్పాండే మహారాష్ట్ర సీపీఎం విభాగంలో వివిధ హోదాల్లో పనిచేశారు. సీఐటీయూ నాసిక్ జిల్లా అధ్యక్షుడిగా, సీఐఎం నాసిక్ పట్టణ యూనిట్ సెక్రెటరీగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. బ్యాంకులు, కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీల్లో డిపాజిట్లు చేసిన ఖతాదారుల పోరాటానికి ఆయన నాయకత్వం వహించారు. అంతేగాక ఎన్నో రైతు, కార్మిక ఉద్యమాల్లో కూడా శ్రీధర్ దేశ్పాండే పాలుపంచుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్కు రాష్ట్రపతి
కాకి ని చూసి మనషులు సిగ్గు పడాలి.. వీడియో వైరల్
కొవిడ్ కొత్త మార్గదర్శకాలు జారీ
తమిళ నటి గౌరీ కిషన్ కు కరోనా పాజిటివ్
కరోనా విలయం.. 89వేలు దాటిన కేసులు