న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. దేశీయ మార్కెట్లోకి మరో ప్రీమియం ఎస్యూవీ ఎక్స్5ను పరిచయం చేసింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ కలిగిన ఈ కారు ప్రారంభ ధర రూ. 77.90 లక్షలుగా నిర్ణయించిం ది. వీటిలో ఎక్స్5 ఎక్స్డ్రైవ్ 30డీ స్పోర్ట్ ఎక్స్ ప్లస్లో మూడు లీటర్ల డీజిల్ ఇంజిన్ కలిగిన ఈ కారు ధర రూ. 77.90 లక్షలుగాను, పెట్రోల్ ఇంజి న్ కలిగిన ఎక్స్5 ఎక్స్డ్రైవ్40ఐ స్పోర్ట్ ఎక్స్ ప్లస్ మోడల్ రూ.79.50 లక్షలుగా నిర్ణయించింది. ఈ రెండు మోడళ్ళు చెన్నై ప్లాంట్లోనే తయారు చేయడం విశేషం. వీటిలో డీజిల్ ఇంజిన్ కలిగిన కారు కేవలం 6.5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనుండగా, పెట్రోల్ ఇంజిన్ కలిగిన కారు 5.5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నది.