న్యూఢిల్లీ: జర్మనీ ఆటో తయారీ దిగ్గజం బీఎమ్డబ్ల్యూ మంగళవారం భారత్లో సరికొత్త బైక్ను లాంచ్ చేసింది. ఎస్ 1000 ఆర్ పేరుతో ప్రీమియం మోటార్ సైకిల్ను మార్కెట్లోకి ఆవిష్కరించింది.
భారత్లో ఈ బైక్ ప్రారంభ ధర రూ.17.9 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. సెకండ్ జనరేషన్ బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ కంప్లీట్లీ బిల్ట్ అప్ యూనిట్ (సీబీయూ) రూపంలో భారత్లోకి దిగుమతి అవుతోంది.
మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బీఎండబ్ల్యూ మోటోరాడ్ డీలర్షిప్లలో కొత్త మోడల్ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగా అభివృద్ధి చేసిన వాటర్ కూల్డ్ 7-సిలిండర్ ఇన్-లైన్ ఇంజిన్ను ఇందులో అమర్చారు. ఈ బైకు కేవలం 3.2 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గరిష్టంగా గంటకు 250 కి.మీ వేగంతో దూసుకెళ్లగలదు.