India Faces Blackout | దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్లతోపాటు పలు రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో బొగ్గు రవాణాకు ఆటంకం ఏర్పడింది. దిగుమతి చేసుకుంటున్న విదేశీ బొగ్గు ధర అధికంగా ఉండటంతో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు కెపాసిటీలో సగానికంటే తక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటమే దీనికి కారణాలుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వలు తగ్గుముఖం పడుతుండటంతో పవర్ ప్లాంట్లు విద్యుత్ ఉత్పత్తిని నియంత్రిస్తున్నాయి.
దేశీయ విద్యుత్ అవసరాల్లో సుమారు 70 శాతం థర్మల్ విద్యుత్ కేంద్రాలే తీరుస్తున్నాయి. అయితే, మొత్తం 135 థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో సగానికి పైగా కేంద్రాల్లో నెలలో 15 రోజులు అవసరానికి అనుగుణంగా బొగ్గు నిల్వలు ఉండేవి. కానీ ఇప్పుడు రెండ్రోజుల మేరకే నిల్వలు ఉన్నాయని గ్రిడ్ ఆపరేటర్ డేటా చెబుతోంది. బొగ్గు కొరతతో కొద్ది రోజుల్లో విద్యుత్ సంక్షోభం ఎదుర్కొనే రాష్ట్రాలేమిటో ఓ లుక్కేద్దామా..!
బొగ్గు కొరతతో పంజాబ్లోని పలు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కరంట్ ఉత్పత్తిలో కోత విధించారు. పలు కేంద్రాల్లో రొటేషనల్ లోడ్ షెడ్డింగ్ నిబంధనలు అమలు చేస్తున్నారు. అవసరాలకు సరిపడా బొగ్గు సరఫరా చేయడంలో కేంద్రం విఫలమైందని పంజాబ్ సర్కార్ ఆరోపిస్తున్నది. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో రాజస్థాన్లో ప్రతి రోజూ ఒక గంట విద్యుత్ కోత అమలు చేస్తున్నారు.
గుజరాత్లో 1,850 మెగావాట్ల విద్యుత్, పంజాబ్లో 475 మెగావాట్లు, రాజస్థాన్లో 380 మెగావాట్లు, మహారాష్ట్రలో 760 మెగావాట్లు, హర్యానాలో 380 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు టాటా పవర్ కాంట్రాక్ట్ పొందింది. కానీ గుజరాత్లో ముంద్రా బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రం కరంట్ ఉత్పత్తిని నిలిపేసింది.
ఆంధ్రప్రదేశ్లో రోజూ 185-190 మెగా యూనిట్ల విద్యుత్కు డిమాండ్ ఉంది. ఏపీ జెన్కో ఆధ్వర్యంలో రాష్ట్ర అవసరాల్లో 45 శాతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. కానీ ఒకటి, రెండు రోజుల విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గు స్టాక్స్ మాత్రమే ఉన్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇక తమిళనాడు ప్రభుత్వం మెయింటెనెన్స్ వర్క్ పేరిట చెన్నైలోని పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ (టాన్జెడ్కో) తాత్కాలికంగా నిలిపివేస్తామని తెలిపింది.
దేశ రాజధాని ఢిల్లీకి విద్యుత్ సరఫరా కాంట్రాక్ట్.. టాటా పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్దే. రొటేషనల్ పవర్ కట్స్ తప్పకపోవచ్చునని టాటా పవర్ శనివారం హెచ్చరించింది. ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కరంట్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలు 1-2 రోజులకు మాత్రమే సరిపడ ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో మాదిరిగా ఢిల్లీ విద్యుత్ కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Facebook Post | ఫేస్బుక్ ఫొటోతో కటకటాలపాలైన వ్యక్తి.. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే?
TATA-Air India | టాటాసన్స్కు ఎయిరిండియా మేనేజ్మెంట్ వీజీ కాదా..?!
Fixed Diposits | ఈ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు.. 7 శాతం వడ్డీ వరకు ఆఫర్!
TATA-Air India | ఎయిరిండియా టెక్నికల్ సపోర్ట్ ఇక టీసీఎస్ చేతికి..!
AWS Cloud Training | క్లౌడ్ కంప్యూటింగ్లో అమెజాన్ ఉచిత శిక్షణ..!