హాంకాంగ్/ సింగపూర్: బిట్కాయిన్తోపాటు ఇతర క్రిప్టో కరెన్సీలు తిరిగి పుంజుకున్నాయి. సెలబ్రిటీ ఇన్వెస్టర్లు సానుకూల కామెంట్స్ చేయడం క్రిప్టో కరెన్సీలకు మళ్లీ ప్రాణం పోసినట్లు కనిపిస్తున్నది. తత్ఫలితంగా క్రిప్టో మేజర్ బిట్ కాయిన్ సోమవారం ట్రేడింగ్లో 12.5 శాతం పుంజుకుని 39,850 డాలర్ల వద్ద స్థిర పడింది.
ఆసియా ఖండంలో గత జూన్ మధ్య నుంచి బిట్ కాయిన్ అత్యధిక స్థాయికి పెరగడం ఇదే మొదటిసారి. ద్వితీయ స్థానంలో ఉన్న ఏథర్ మూడు వారాల గరిష్ఠ స్థాయితో 2,344 డాలర్లు పలికింది.
సంప్రదాయేతర ఇంధనాన్ని ఉపయోగిస్తూ తయారు చేస్తే బిట్ కాయిన్లను తమ కార్ల క్రయ విక్రయాల పేమెంట్లకు అనుమతించవచ్చునని ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా సీఈవో ఎలన్ మస్క్ తెలిపారు.
విద్యుత్తో తయారు చేస్తున్న బిట్ కాయిన్లతో పేమెంట్స్ను సస్పెండ్ చేస్తున్నట్లు గత మేలో మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇన్వెస్టర్లు బిట్ కాయిన్ల అమ్మకానికి ప్రాధాన్యం ఇచ్చారు.
భవిష్యత్లో సోషల్ మీడియా సంస్థలో డిజిటల్ కరెన్సీ.. పెద్ద వాటా కలిగి ఉంటుందని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ బాస్ జాక్ డోర్సీ ప్రకటించారు. ఇక ఈ ఏడాది చివరికల్లా బిట్ కాయిన్ చెల్లింపులను అమెజాన్ అనుమతిస్తుందని వార్తలొచ్చాయి.
డిజిటల్ అసెట్ ప్లాట్ఫామ్ ఓఎస్ఎల్ గ్లోబల్ హెడ్ ర్యాన్ రాబాగ్లియా స్పందిస్తూ గత ఐదు సెషన్లలో స్వల్పకాలిక బుల్లిష్నెస్ కనిపించిందన్నారు. గత 24 గంటల్లో 120 కోట్ల డాలర్ల పెట్టుబడులు వచ్చి పడ్డాయన్నారు.
రెండు కంపెనీల మధ్య టెక్నాలజీ వివాదం
ఈ నెల 31 న భారత్-చైనా మధ్య 12వ రౌండ్ చర్చలు
నార్వేలో జోరుగా ఉల్కాపాతం.. వెబ్ కెమెరాలో రికార్డ్
కార్గిల్ అమరవీరులకు రాష్ట్రపతి నివాళి
చరిత్రలో ఈ రోజు.. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం
మొబైల్ వాడకంలో మనకు మూడో స్థానం
ఒత్తిడితో తెల్లటి జుట్టుకు ప్రత్యక్ష సంబంధం : తేల్చిన పరిశోధకులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..