బీజింగ్: బిట్ కాయిన్తో సహా అగ్రశ్రేణి క్రిప్టో కరెన్సీలపై దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. క్రిప్టో ఇండస్ట్రీపై చైనాలో మరోమారు నిషేధాజ్ఞలు జారీ అయ్యాయి. చైనా సోషల్ మీడియా వేదిక వైబో.. కొన్ని సోషల్ మీడియా ఖాతాలను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దీనిపై వైబో అధికార ప్రతినిధి స్పందించడానికి నిరాకరించారు.
క్రిప్టో కరెన్సీని సంస్థాగతంగా స్వీకరించడానికి చాలా పెద్ద ప్రక్రియ ప్రముఖ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ గోల్డ్మాన్ సాచెస్ నివేదిక వెల్లడించింది.
దీంతో బిట్ కాయిన్తో సహా 30 క్రిప్టో కరెన్సీలు ఆదివారం నుంచి గత 24 గంటల్లో పతనం అయ్యాయి. కాయిన్ జెకో అంచనా ప్రకారం ఎథిరియం మాత్రం స్వల్పంగా లాభ పడింది.
ఇంతకుముందే క్రిప్టో కరెన్సీల ట్రేడింగ్, బిట్ కాయిన్ మైనింగ్పై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపాయి. దీంతో క్రిప్టో కరెన్సీల ధరలపై ఒత్తిడి పెరిగింది. వైబో నిషేధాజ్ఞలు, గోల్డ్మాన్ సాచెస్ నివేదికల ఫలితంగా బిట్ కాయిన్ 20 రోజుల దిగువ స్థాయికి పడిపోయింది. 200 రోజుల కనిష్ఠ స్థాయి పడిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, బిట్ కాయిన్ రియల్ మనీ కాదని టెస్లా సీఈవో ఎలన్ మస్క్ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై హ్యాకర్లు బెదిరింపులకు దిగారు. బిట్ కాయిన్ ఆదివారం ఉదయం 5.30 గంలకు 35,541 డాలర్ల వద్దకు పడిపోయింది. గత 24 గంటల్లో ఇది 4.12 శాతం పతనం.