న్యూఢిల్లీ: వివిధ సంస్థలు, కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులకు అలర్ట్. ఆయా ఉద్యోగుల, కార్మికులకు ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్) ఖాతాల నిర్వహణ నిబంధనల్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. దీని ప్రకారం మంగళవారం (2021 జూన్ 1) నుంచి పీఎఫ్ ఖాతాలను ఆధార్తో అనుసంధానించడం తప్పనిసరి.
అలా చేయని పక్షంలో పీఎఫ్లో జమ చేసే మొత్తంపై ప్రభావం పడుతుంది. ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలతో ఆధార్ అనుసంధాన బాధ్యతలను సంబంధిత సంస్థల, కంపెనీల యాజమాన్యాలకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) అప్పగించింది.
ఒకవేళ ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాతో ఆధార్ను లింక్ చేయకపోతే యాజమాన్యం జమ చేసే నగదు ఇక మీ పీఎఫ్ ఖాతాలో జమ కాదు. కనుక మీ పీఎఫ్ ఖాతాను వెంటనే ఆధార్తో లింక్ చేయాలని తెలుసుకోండి.
అలాగే, మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)నూ ఆధార్తో లింక్ చేసుకోవాలి. ఈ విషయమై ఈపీఎఫ్ఓ ఉత్తర్వులు జారీ చేసింది.
అసలు సంగతేమిటంటే కేంద్రం కొత్తగా ఆమోదించిన లేబర్ కోడ్ల్లో భాగంగా.. సామాజిక భద్రతా కోడ్-2020లోని సెక్షన్ 142 కింద ఈపీఎఫ్వో కొత్త నిర్ణయం తీసుకున్నది. దీని ప్రకారం జూన్ ఒకటో తేదీ నుంచి, పీఎఫ్ ఖాతా ఆధార్తో లింక్ చేయకున్నా, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) ఆధార్తో ధృవీకరించకున్నా, ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్(ఈసీఆర్) దాఖలు చేయరు.
అంటే, ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలో సంస్థ యాజమాన్యం వాటా జమ కాదు జమ చేసే వాటాను ఇక నుంచి పొందలేరు. జూన్ ఒకటో తేదీలోగా తమ ఉద్యోగుల ఖాతాలను ఆధార్తో లింక్ చేసి ధృవీకరించాలని యాజమాన్యాలను ఈపీఎఫ్ఓ ఆదేశించింది.
అయితే, ఆధార్తో పీఎఫ్ ఖాతా అనుసంధానించడం ఇలా:
తొలుత ఈపీఎఫ్ఓ వెబ్సైట్ (www.epfindia.gov.in)లోకి వెళ్లి లాగిన్ కావాలి. తర్వాత ఆన్లైన్ సర్వీసెస్పై క్లిక్ చేసి ఈ -కేవైసీ పోర్టల్కు వెళ్లి యూఏఎన్ ఆధార్ లింక్ పై క్లిక్ చేయాలి.
యూఏఎన్ ఖాతాలో రిజిస్టర్ చేసిన మీ యూఏఎన్ నంబర్, మొబైల్ నంబర్ను ఎంటర్ చేయాలి. అటుపై మీ మొబైల్ ఫోన్కు ఓటీపీ నంబర్ వస్తుంది. ఆ ఓటీపీతోపాటు 12 అంకెల ఆధార్ సంఖ్యను ఎంటర్ చేసి ఫారమ్ సమర్పించాలి.
ఇప్పడు ఓటీపీ ధృవీకరణ ఎంపికపై క్లిక్ చేయండి. చివరిగా మీ ఆధార్ వివరాల ధృవీకరణకు మీ ఆధార్కు లింక్ చేసిన మొబైల్ నంబర్, ఈ-మెయిల్లో ఓటీపీ వస్తుంది. ఈ ధృవీకరణ తర్వాత మీ ఆధార్తో మీ పీఎఫ్ ఖాతా అనుసంధానం పూర్తవుతుంది.
రేపట్నుంచి బ్యాంకుల పని వేళల్లో మార్పు
ఐటీ రూల్స్: ఫిర్యాదుల స్వీకరణకు సోషల్ మీడియా ఏర్పాట్లు!
చిన్న వ్యాపారులకు రిలీఫ్.. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ!
ఎస్బీఐ vs యాక్సిస్ vsహెచ్డీఎఫ్సీ ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా..
కరోనా వేళ కస్టమర్లకు ఎస్బీఐ రిలీఫ్.. అదేంటంటే!!
మోదీ సర్కార్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : సచిన్ పైలట్
జూన్ 20 తర్వాత స్పుత్నిక్ వీ టీకాల తొలి బ్యాచ్ రాక
రాజద్రోహానికి పరిమితులను సెట్ చేయాల్సిందే: సుప్రీంకోర్టు
ఆర్థిక ఇబ్బందులతో సర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు
రెండు వేర్వేరు డోసులు తీసుకుంటే ఎలా ? వ్యాక్సిన్ మిక్సింగ్పై త్వరలో స్టడీ
కరోనా చికిత్స: రూ.5 లక్షల వరకు అన్సెక్యూర్డ్ లోన్లు!
ఐసోలేషన్ కేంద్రంతో నిరుపేదలకు మేలు
స్మార్ట్ ఫోన్ల సేల్స్లో రికార్డులు.. ఎంతంటే?!