న్యూఢిల్లీ: కరోనా భారతీయుల్లో తమ ఫిట్ నెస్ పట్ల స్పృహను మేల్కోల్పింది. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా సైకిళ్ల కొనుగోళ్లకు డిమాండ్ పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2020-210)తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 20 శాతం ఎక్కువైంది. ఇది దశాబ్ధ క్రితం స్థాయి గ్రోత్. 2020-21లో 1.21 కోట్ల సైకిళ్లు అమ్ముడైతే ఈ ఏడాది 1.45 కోట్లకు పెరుగుతాయి.
కరోనా మహమ్మారి ప్రభావం సైకిళ్ల డిమాండ్ను పెంచుతున్నది. తమ ఫిట్ నెస్ పెంచుకోవడానికి భారతీయుల్లో స్పృహ పెరిగింది. 2019లో సైకిళ్ల విక్రయాలు ఐదు శాతం పెరిగాయి. కానీ 2021లో 22 శాతం తగ్గిపోయాయి. దీనికి లాక్డౌన్తో దుకాణాల మూసివేత, ప్రభుత్వ కొనుగోళ్లు తగ్గుముఖం పట్టడమే కారణం.
ప్రపంచంలోనే సైకిళ్ల తయారీలో భారత్కు రెండో స్థానం. సైకిళ్ల పరిశ్రమను నాలుగు సెగ్మెంట్లుగా విభజిస్తారు. స్టాండర్డ్, ప్రీమియం, కిడ్స్, ఎక్స్పోర్ట్స్ అని చూడొచ్చు. స్టాండర్డ్ సెగ్మెంట్ సైకిళ్లకు ఫుల్ డిమాండ్. 2020లో అమ్ముడైన సైకిళ్లలో 50 శాతం స్టాండర్డ్ సెగ్మెంట్వే.
ఫిట్ నెస్, విశ్రాంతి అవసరాల కోసం పిల్లల్లో ప్రీమియం సైకిళ్ల కోసం డిమాండ్ పెరిగింది. మరో 10 శాతం ఇతర సెగ్మెంట్ సైకిళ్ల ఎగుమతులు, దేశీయ కొనుగోళ్లు ఉంటాయి.
క్రిసిల్ డైరెక్టర్ నితేశ్ జైన్ మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోళ్లు తగ్గినా 2021లో ప్రీమియం, కిడ్స్ సెగ్మెంట్స్కు డిమాండ్ ఎక్కువ అన్నారు. గత రెండేండ్లతో పోలిస్తే కొన్ని నెలలుగా వివిధ ప్రభుత్వశాఖల్లో సైకిళ్ల కొనుగోళ్లకు డిమాండ్లు మెరుగయ్యాయి.
చరిత్రలో ఈరోజు.. తొలి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం
సెంట్రల్ బ్యాంక్, ఐఓబీలో వాటా విక్రయానికి కేంద్రం సన్నాహలు
అన్లాక్ షురూ : మెట్రో రైల్, మార్కెట్లు ఓపెన్
కొవిడ్ చికిత్స నుంచి ఐవర్మెక్టిన్, డాక్సీసైక్లిన్ ఔట్.. సీటీ స్కాన్లూ వద్దు!
దేశంలో ప్రమాదకరమైన కరోనా మరో వేరియంట్ గుర్తింపు
కొవాగ్జిన్ కంటే కొవిషీల్డ్తోనే ఎక్కువ యాంటీబాడీలు!
మళ్లీ అమ్మాయి పుట్టిందని భార్యా పిల్లలను బావిలోకి తోసేసిన భర్త
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఢిల్లీ ఎయిమ్స్లో పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్
అధిష్ఠానం కోరితే రాజీనామా చేస్తా
జూలై 1 నుంచి బ్యాడ్ బ్యాంక్ ప్రారంభం?! ఎందుకంటే?!
చోక్సీ అప్పగింత డౌటేనా? అసలేం జరిగింది?!
స్వల్పకాలం కార్ల ధరలు స్టేబుల్: ఫోక్స్ వ్యాగన్