న్యూఢిల్లీ, మే 1: భీమ్ యూపీఐ ద్వారా ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన డిజిటల్ లావాదేవీలు 2.2 శాతం పడిపోయాయి. అంతకుముందు నెల మార్చిలో రూ.5.05 లక్షల కోట్ల లావాదేవీలు జరుగగా, గత నెల ఏప్రిల్లో రూ.4.94 లక్షల కోట్ల లావాదేవీలే జరిగాయి. ఈ మేరకు శనివారం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది. కాగా, ఏప్రిల్లో అన్ని యూపీఐల ద్వారా జరిగిన మొత్తం డిజిటల్ లావాదేవీల విలువ 2.64 బిలియన్ డాలర్లుగా ఉన్నది.