హైదరాబాద్, జూలై 20(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఎఫ్టీసీసీఐ) 2021-22 సంవత్సరానికిగాను నూతన అధ్యక్షులుగా కే భాస్కర్ రెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులుగా అనిల్ అగర్వాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం హైదరాబాద్లోని ఫెడరేషన్ భవన్లో నిర్వహించిన సమాఖ్య 104వ వార్షిక సమావేశంలో నూతన కార్యావర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు.