సిద్ధం కావస్తున్న ఫ్యాక్టరీ
న్యూఢిల్లీ, జూన్ 26: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కర్మాగారం తొలి దశ పనులు దాదాపు పూర్తి కావచ్చాయని శనివారం ఓలా గ్రూప్ సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు. త్వరలోనే ఉత్పత్తి మొదలు పెడుతామన్న ఆశాభావాన్ని ఆయన ట్విట్టర్లో వ్యక్తం చేశారు. తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యాక్టరీని తమిళనాడులో రూ.2,400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్నట్లు గతేడాది ఓలా ప్రకటించిన విషయం తెలిసిందే. ఏటా 20 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్ తయారీ కేంద్రంగా వస్తున్న ఈ ప్లాంట్లో సుమారు 10వేల మందికి ఉద్యోగావకాశాలుంటాయని ఓలా చెప్తున్నది.