హైదరాబాద్, అక్టోబర్ 14: మొబైల్ రిటైల్ సంస్థ సెలెక్ట్… దసరా పండుగను పురస్కరించుకొని ప్రకటించిన ఆఫర్లు ఈ నెల 17 వరకు అందుబాటులో ఉండనున్నాయని వెల్లడించింది. గతవారం సంస్థ ప్రకటించిన ఆఫర్లకు కస్టమర్ల నుంచి విశేష స్పందన రావడంతో ఈ కాలపరిమితిని పొడిగించినట్లు కంపెనీ సీఎండీ వై గురు తెలిపారు. మొబైల్ కొనుగోలుపై రూ.10 వేల వరకు క్యాష్బ్యాక్తోపాటు జీరో డౌన్పేమెంట్, మొబైల్ కొనుగోళ్ళపై టీడబ్ల్యూఎస్, స్పీకర్లు, ట్రాలీ సూట్ కేస్తోపాటు ప్రతి కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతిని అందిస్తున్నట్లు చెప్పారు.