ప్రారంభ ధర రూ.2.17 కోట్లు
న్యూఢిల్లీ, జూన్ 17: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త సెడాన్ ఎస్-క్లాస్ను పరిచయం చేసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయిస్తున్న ఈ కారు ధరను రూ.2.17 కోట్లుగా నిర్ణయించింది. ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న ఈ కారును ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచి పుణెలోని ప్లాంట్లోనే తయారు చేసేయోచనలో ఉన్నది. ఏడో జనరేషన్గా విడుదల చేసిన ఈ కారు రెండు రకాల్లో లభించనున్నది. దీంట్లో డీజిల్ ఎస్ 400డీ 4 మేటిక్ ధర రూ.2.17 కోట్లుగాను, పెట్రోల్ ఎస్ 450 4 మేటిక్ ధర రూ.2.19 కోట్లుగా నిర్ణయించింది.