ముంబై: వచ్చేనెలలో బ్యాంకులకు మూడు వారాల పాటు సెలవులు ఉన్నాయి. రెండో తేదీన గాంధీ జయంతి మొదలు మహాలయ అమావాస్య, దుర్గాపూజ, విజయ దశమి తదితర పర్వ దినాల సందర్భంగా ఆర్బీఐ సెలవులు ప్రకటించింది. ఆర్బీఐ రూల్స్ ప్రకారం అక్టోబర్లో 14 రోజుల సెలవులు ఉన్నాయి. దీంతోపాటు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారం కలిపి ఏడు వీకెండ్ సెలవులు వచ్చాయి. అక్టోబర్ ఒకటో తేదీన బ్యాంకుల ఖాతాల క్లోజింగ్ సందర్భంగా గ్యాంగ్టక్లో సెలవు.
అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంచుతారు. 3న ఆదివారం. 6న మహాలయ అమవాస్య సందర్భంగా అగర్తల, బెంగళూరు, కోల్కతాల్లో బ్యాంకులకు సెలవు.
వచ్చేనెల ఏడో తేదీన ఇంఫాల్లో బ్యాంకులు పనిచేయవు. 9న రెండో శనివారం, 10 ఆదివారం వీకెండ్ సెలవులు. 12న అగర్తల, కోల్కతాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. 13న దుర్గాపూజ మహా అష్టమి సందర్భంగా అగర్తల, భువనేశ్వర్, గ్యాంగ్ టక్, గువాహటి, ఇంఫాల్, కోల్కతా, పాట్నా, రాంచీలలో బ్యాంకులు పనిచేయవు.
14న దుర్గాపూజ మహా నవమి సందర్భంగా అగర్తల, బెంగళూరు, చెన్నై, గ్యాంగ్టక్, గువాహటి, కాన్పూర్, కొచ్చి, కోల్కతా, లక్నో, పాట్నా, రాంచీ, శ్రీనగర్, తిరువనంతపురంలలో బ్యాంకులకు సెలవు. 15న దుర్గా పూజ సందర్భంగా ఇంఫాల్ మినహా అన్ని ప్రాంతాల్లో బ్యాంకులు పని చేయవు. గ్యాంగ్టక్లో 16న దుర్గాపూజ సెలవు. 17న ఆదివారం. 18న గువాహటిలో బ్యాంకులు పని చేయవు.
19న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా అహ్మదాబాద్, బేలాపూర్, భోపాల్, చెన్నై, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇంఫాల్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, లక్నో, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ, రాయపూర్, రాంచీ, శ్రీనగర్, తిరువనంతపురంలలో బ్యాంకులు పనిచేయవు.
20న మహర్షి వాల్మికి పుట్టిన రోజు, లక్ష్మీ పూజ సందర్భంగా అగర్తల, బెంగళూరు, చండీగఢ్, కోల్కతా, సిమ్లాలలో బ్యాంకులకు సెలవు. 22న శ్రీనగర్లో మిలాద్ ఉన్ నబీ తర్వాత శుక్రవారం సెలవు ఇచ్చారు. ఇక 23న నాల్గో శనివారం, 24న ఆదివారం వీకెండ్ సెలవులు. కనుక వివిధ బ్యాంకుల ఖాతాదారులు ఈ సెలవులను దృష్టిలో పెట్టుకుని తమ లావాదేవీలపై తగిన ప్రణాళిక రూపొందించుకోవాలని ఆర్బీఐ కోరింది.