దామరచర్ల, జూన్ 29 : సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 4వేల మెగావాట్ల యాదాద్రి పవర్ప్లాంటు నిర్మాణాన్ని ఎన్ని అవాంతరాలు ఎదురైనా 2023లో పూర్తిచేసి మొదటి రెండు ప్లాంట్లలో విద్యుత్తు ఉత్పత్తి చేస్తామని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండ లం యాదాద్రి పవర్ప్లాంటులో రూ.1.25 కోట్లతో నిర్మించిన 30 పడకల దవాఖానను మంగళవారం జెన్కో సీఎండీ ప్రభాకర్రావుతో కలిసి ప్రారంభించారు. పనుల ప్రగతిపై జెన్కో, బీహెచ్ఈఎల్ అధికారులతో సమీక్షించారు అనంతరం మంత్రి మాట్లాడు తూ.. కార్మికుల కోసం ప్రత్యేకంగా దవాఖాన ఏర్పా టు చేశామని, ఇక్కడ పనిచేస్తున్న వారందరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేస్తామని చెప్పారు. ఇప్పటికే వెయ్యి మందికి టీకా వేశామని తెలిపారు. కార్యక్రమంలో జెన్కో డైరెక్టర్లు అజయ్, కృష్ణానందం, శ్రీనివాస్రావు, సీఈ సమ్మయ్య, హనుమాన్, మురళి, బుచ్చయ్య పాల్గొన్నారు.