హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య సేవలు, దవాఖానల్లో సౌకర్యాలను మెరుగుపరడం వంటి అంశాలపై ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం నేడు భేటీకానుంది. మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన ఏర్పాటైన ఈ ఉపసంఘం సమావేశమవడం ఇదే మొదటిసారి. ఈ కమిటీలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి, సత్య వతి రాథోడ్ సభ్యులుగా ఉన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు, మౌలిక సదుపాయాల కల్పనపై త్వరలో అధ్యయనం చేయనుంది.