పీర్జాదిగూడ, ఏప్రిల్ 23 : కరోనా రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో కరోనా కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలో పీర్జాదిగూడ కార్పొరేషన్ కరోనా వైరస్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ప్రతి రోజు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ జక్క వెంకట్రెడ్డి నేతృత్వంలో అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కార్పొరేషన్లోని ప్రధాన రహదారులు, పలు కాలనీలు, బస్తీల్లో కరోనా నియంత్రణపై తీసుకోవా ల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నగరపాలక పరిధి ప్రతి డివిజన్లో పారిశుధ్య పనులను సిబ్బంది ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ శుభ్ర పరుస్తున్నారు. ప్రతి డివిజన్లో ఉన్న ప్రజలకు మాస్క్లు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించేలా కరోనాపై పూర్తి అవగాహన కల్పిస్తున్నారు.
మేడిపల్లిలో గతేడాది జూలై మాసంలో పాత పోలీస్స్టేషన్ భవనంలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయడంలో ఎంతో ప్రజాదరణ పొందింది. కరోనా వైరస్ ప్ర భావం తగ్గుతుదల కావడంతో ఈ ఐసోలేషన్ కేంద్రంలో కరోనా టెస్టులు మాత్రమే చేస్తున్నారు. కాగా ఇప్పుడు కరోనా రెండో దశ విజృంభించడంతో మంత్రి మల్లారెడ్డి ఆ దేశాల మేరకు స్థానిక మేయ ర్ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకెళ్లి పునఃప్రారంభానికి చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు వైద్యాధికారులు, కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ కేంద్రంలో 30పడకలను ఏర్పాటు చేస్తున్నారు. నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు కోసం, ఇంటి వద్ద సరైన సదుపాయాలు లేని బాధితులకు ఈ కేంద్రం ఉపయోగపడుతుంద న్నారు.
కరోనా రహిత కార్పొరేషన్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. ఐసోలేషన్ కేంద్రంలో కరోనా బాధితులకు 30పడకలతో ఏర్పాటు చేస్తున్నాం. పీర్జాదిగూడ మున్సిపల్ పరిధిలో కరోనా బాధితులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు కరోనాపై అప్రమత్తంగా ఉండేందుకు పూర్తి అవగాహన కల్పిస్తున్నాం. బాధితుల సౌకర్యార్థం ఐసొలేషన్ కేంద్రం లో అన్ని సదుపాయాలు కల్పించాం. ఐసోలేషన్ కేంద్రం లో కరోనా బాధితులకు మేరుగైనా వైద్య సేవలందించడానికి చర్యలు తీసుకుంటున్నాం.
పీర్జాదిగూడ నగరపాలక పరిధి మేడిపల్లిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని సోమవారం మంత్రులు ఈటెల రాజేందర్, చామకూర మల్లారెడ్డి ప్రారంభించనున్నట్లు స్థానిక మేయర్ జక్క వెంకట్రెడ్డి తెలిపారు. నగరపాలక పరిధి మేడిపల్లిలో కొవిడ్-19 ఐసోలేషన్ సెంటర్ను కరోనా బాధితల సౌకర్యార్థం 30పడకలతో ఏర్పా టు చేస్తున్నామని తెలిపారు.