న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్ను నియంత్రించడానికి పలు రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేస్తుండటంతో దేశీయ బ్యాంకులు తమ సేవల వేళలు మార్చేశాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) మార్గదర్శకాల మేరకు బ్యాంకులు తమ పని వేళలు మార్చుకున్నాయి.
పెరిగిన కొవిడ్-10 కేసులను కట్టడి చేయడానికి బ్యాంకులు పని వేళలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు పరిమితం చేయాలని బ్యాంకర్లకు ఐబీఏ సూచించింది. ఈ మార్గదర్శకాలు ఈ నెలాఖరు వరకు ఈ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు వర్తిస్తాయి.
బ్యాంకులన్నీ తమ ఖాతాదారులకు క్యాష్ విత్ డ్రాయల్స్, డిపాజిట్లు, ప్రభుత్వ బిజినెస్లు, చెల్లింపులు అనే నాలుగు తప్పనిసరి సేవలను అందించాలని ఐబీఏ సూచించింది. పరిస్థితులకు అనుగుణంగా ఖాతాదారులకు అదనపు సేవలను అందించే విషయమై రాష్ట్ర స్థాయి లేదా కేంద్ర పాలిత ప్రాంతాల స్థాయీ బ్యాంకింగ్ కమిటీలు నిర్ణయం తీసుకోవచ్చునని తెలిపింది.
అలాగే బ్యాంకింగ్ సిబ్బంది రొటేషనల్ ప్రాతిపతికన విధులకు హాజరు కావాలని సూచించింది. బ్యాంకుల ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వసతిని అనుమతించింది. 50 శాతం ఉద్యోగులు రొటేషనల్ ప్రాతిపదికన విధులకు హాజరు కావాలని పేర్కొంది.
ఇప్పటికే దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన శాఖల పని వేళలను మార్చేసింది. తమ ఖాతాదారులు తప్పనిసరి అవసరమైతేనే బ్యాంకు శాఖలను సందర్శించాలని హితవు చెప్పింది. ఈనెలాఖరు వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకింగ్ సేవలను అనుమతించింది.
ఖాతాదారులతోపాటు ఉద్యోగుల భద్రత కోసం భౌతిక దూరం పాటించడం, బ్యాంకుల శానిటైజేషన్ వంటి కొవిడ్-19 ప్రొటోకాల్స్ను ఎస్బీఐ పాటిస్తున్నది. బ్యాంకులను సందర్శించే ఖాతాదారులు తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించాల్సిందేనని స్పష్టం చేసింది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఈ-కామర్స్పై ఫిర్యాదు ఇక సులభం
బార్జ్ మునక : నాలుగో రోజు కొనసాగుతున్న అన్వేషణ
కాలికట్ చేరిన వాస్కోడిగామా.. చరిత్రలో ఈరోజు
అహ్మదాబాద్లో కుప్పకూలిన ఐదంతస్థుల భవనం.. వీడియో
సముద్ర పర్యవేక్షణకు ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా
మార్స్పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవర్
ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవచ్చు.. ఆర్బీఐ సర్క్యులర్ జారీ
కమల్ హాసన్ కు మరో షాక్: ఎంఎన్ఎంను వీడిన కుమార్ వేల్
విజయకాంత్ ఆరోగ్యంపై భిన్న కథనాలు..!
కోవిడ్ పాజిటివ్ పరీక్షలెన్నిరకాలు..? స్టెరాయిడ్స్ ఎందుకు ఇస్తారు?
వ్యాక్సిన్ తయారీ : నూతన ఫార్మా బిలియనీర్లుగా ఎదిగారు!
జూన్ 1-6 మధ్య ఐటీ వెబ్సైట్ పని చేయదు.. ఎందుకంటే!
ఇండియాలో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత? త్వరలో మరో కమిటీ ఏర్పాటు!!
గుజరాతీలకు మారుతి అండ: సీతాపూర్లో మల్టీ స్పెషాలిటీ దవాఖాన
క్రెడిట్ కార్డుల వాడకంతో ఇలా రివార్డు పాయింట్లు..!
అత్యంత ఖరీదైన కాన్వాయ్ ముఖేష్ అంబానీదే..
పీపీఎఫ్లో రూ.12 వేల మదుపు.. 15 ఏండ్లకు ఎంత లభిస్తుందంటే..