సిద్దిపేట అర్బన్/ సిద్దిపేట జోన్, ఏప్రిల్ 27 : రాష్ట్రంలో కరోనా విజృంభించి ఎవరి ప్రాణాలు.. ఎవరి చేతుల్లో లేకుండా పోయిందని, ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేను టీకా వేసుకున్నానని, మీరు కూడా టీకా వేసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు. కరోనా విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ వేడినీళ్లు తాగుతూ, మాస్క్ తప్పనిసరిగా ధరించి, శానిటైజర్ను వాడాలని సూచించారు. 45ఏండ్లు దాటిన వారితో పాటు మే 1వ తేదీ నుంచి ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని చెప్పారు.