న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ సీఈవోగా వినోద్ కే దాసరి రాజీనామా చేశారు. ఎచిర్ మోటార్స్ బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గానూ వైదొలిగారు. శుక్రవారం నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానున్నది.
వినోద్ కే దాసరి స్థానంలో బీ గోవింద రాజన్ ఈ నెల 18న బాధ్యతలు స్వీకరిస్తారు. ఎచిర్ మోటార్స్ హోల్టైం డైరెక్టర్గా, రాయల్ ఎన్ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా గోవింద రాజన్ను నియమితులు కానున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్కు గోవిందరాజన్ 2013 నుంచి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా సేవలందిస్తున్నారు.
ఇటీవలే చెన్నైలో వినోద్ కే దాసరి ఒక దవాఖానను ప్రారంభించారు. ప్రజలకు చౌకగా హెల్త్కేర్ వసతులను అందుబాటులోకి తేవడానికి తన మిగతా సమయాన్ని వెచ్చించనున్నారని రాయల్ ఎన్ఫీల్డ్ తెలిపింది. అందుకే తమ సీఈవోగా వైదొలిగారని రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది.
వినోద్ కే దాసరి సేవలను ఎచిర్ మోటార్స్ ఎండీ సిద్ధార్థ లాల్ ప్రశంసించారు. తమ సంస్థకు గణనీయ సేవలందించారని పేర్కొన్నారు. గత రెండేండ్లుగా రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థతో అనుబంధం చిరస్మరణీయం అని వినోద్ కే దాసరి అన్నారు.