న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: విప్రో అధినేత అజీం ప్రేమ్జీ దాతృత్వంలో తన తోటి కార్పొరేట్లకు అందనంత ఎత్తులో నిలిచారు. మునుపెన్నడూ లేనివిధంగా గతేడాది ఏకంగా రూ.7,904 కోట్లను ఆయన, ఆయన కుటుంబం విరాళాలుగా ఇచ్చినట్లు తాజాగా విడుదలైన ఎడిల్గీవ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితా-2020లో తేలింది. ఇందులో శివ్ నాడర్, ముకేశ్ అంబానీ కుటుంబాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. వీరి డొనేషన్లూ ఆల్టైమ్ హైలో ఉండటం విశేషం. కరోనా వైరస్ ధాటికి అన్ని భారతీయ రంగాలు కుప్పకూలిన వేళ.. నిరుడు దేశంలోని 90 మంది భారీ దాతలు, వారి కుటుంబాలు ఇచ్చిన విరాళాల విలువ రూ.9,324 కోట్లుగా ఉన్నది. ఇక రూ.10 కోట్ల కంటే ఎక్కువ విరాళాలనిచ్చిన దాతల సంఖ్య.. గడిచిన రెండేండ్లలో 37 నుంచి 80కి పెరిగినట్లు హురున్ తెలిపింది. జాబితాలోని వారి సగటు వయసు 66గా ఉండగా, 40 ఏండ్ల వయసులోనే ఈ లిస్టులోకి ఎక్కిన తొలి వ్యక్తిగా బిన్నీ బన్సల్ నిలిచారు. జాబితాలోకి కొత్తగా 30 మంది చేరగా, ఏడుగురు మహిళలున్నారు.
కార్పొరేట్లు అత్యధికంగా తమ విరాళాలను విద్యా రంగానికే ఇస్తున్నారు. 79 శాతం నిధులు విద్యాభివృద్ధికే వెళ్తున్నాయి. ఆ తర్వాత ఆరోగ్య సంరక్షణ రంగం ఉన్నది. కరోనా నేపథ్యంలో 2019తో పోల్చితే 2020లో హెల్త్కేర్కు విరాళాలు 137 శాతం పెరుగడం గమనార్హం. విపత్తు నిర్వహణ-సాయానికీ 240 శాతం పెరిగాయి
టాప్-10 దాతలు (రూ.కోట్లలో)