న్యూఢిల్లీ, ఆగస్టు 4: అవంతా గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ థాపర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. రూ.500 కోట్ల మనీ లాండరింగ్ కేసులో మంగళవారం రాత్రి ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోగా, బుధవారం ఢిల్లీ కోర్టు ఆయనకు ఒకరోజు కస్టడీ విధించింది. నిజానికి 14 రోజుల కస్టడీకి ఈడీ కోరగా, గురువారం తమ ఎదుట హాజరు పర్చాలని, ఇరు వర్గాల వాదనల అనంతరం తదుపరి కస్టడీపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది.