అమీన్పూర్, జూలై 2 : మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని ఎంపీపీ దేవానంద్ పిలుపునిచ్చారు. శుక్రవారం పటేల్గూడ గ్రామ పంచాయతీలో ‘పల్లె ప్రగతి’లో భాగంగా సర్పంచ్ నితీషాశ్రీకాంత్తో కలిసి ఆయన మొక్కలు పంపిణీ చేశారు. గ్రామాలను ఆకు పచ్చని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసి పని చేయాలని కోరారు. అంతకుముందు ఆయన ఇంటింటికీ ఆరు మొక్కలను పంపిణీ చేశారు. అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ‘పట్టణ ప్రగతి’లో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో పర్యటించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 15 వ వార్డు కేఎస్ఆర్, ఎన్ఆర్ఐ, ఆనంద్నగర్ కాలనీ, సాయిరాం నగర్ కాలనీల్లో కౌన్సిలర్ కాట సుధారాణి శ్రీనివాస్గౌడ్ సందర్శించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నందారం నర్సింహాగౌడ్, కౌన్సిలర్లు బాసెట్టి కృష్ణ, మల్లేశ్, బాలమణి, కల్పన ఉపేందర్రెడ్డి, కవితా శ్రీనివాస్రెడ్డి, బీజిలీ రాజు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన ఎమ్మెల్యే
పటాన్చెరు, జూలై 2 : పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఏషియన్ పెయింట్స్ పరిశ్రమ వద్ద గల డంపింగ్ యార్డు ప్రాంగణంలో కార్పొరేటర్ కుమార్ యావద్తో కలిసి ఎమ్మె ల్యే మహిపాల్రెడ్డి మొక్కలు నాటారు. మండలంలోని నందిగామ పాలకవర్గం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ బాలయ్య, జడ్పీటీసీ సుప్రజా వెంకట్రెడ్డి, ఎంపీపీ సుష్మా వేణుగోపాల్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అఫ్జల్, ఎంపీడీవో బన్సీలాల్, సర్పంచ్ ఉమావతి గోపాల్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు పెంచాలి
ఝరాసంగం,జూలై 2: ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు పెంచాలని జడ్పీ సీఈవో ఎల్లయ్య గ్రామస్తులకు సూచించారు. చిల్కేపల్లి పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఇం టింటికీ మొక్కల పంపిణీ చేసే కార్యక్రమంలో పా ల్గొన్నారు. బుడగజంగం కాలనీలో ఝరాసంగం గ్రామ ప్రత్యేకాధికారి మారుతివిఠోభ మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏపీడీ జయదేవులు, ప్రత్యేక అధికారి ఏపీఎం బాలకృష్ణ, సర్పంచ్లు ఇందిరాసత్యనారాయణరెడ్డి, జగదీశ్వర్, ఎంపీటీసీ శకుంతలమ్మ, ఉపసర్పంచ్ శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్ సత్యమ్మ, కార్యదర్శి శ్రీనివాస్, స్థానికులు పాల్గొన్నారు.
ఇంటింటికీ మొక్కల పంపిణీ
సదాశివపేట, జూలై 2 : పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని గ్రామాల్లో అధికారులు ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. వార్డుల్లో గడ్డి, కలుపు మొక్కలను గ్రామ పంచాయతీ ట్రాక్టర్, సిబ్బంది సహాయంతో తొలగించారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలను అందజేసి వాటిని నాటడంతో పాటు కాపాడుకోవాలని సూచించారు. ప్రత్యేక అధికారి, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి సునీత మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో మొక్కలను పంపిణీ చేశారు. రెండో రోజు పట్టణంలోని 2, 6, 12, 18 వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, చైర్ పర్సన్ పిల్లోడి జయమ్మ ఆయా వార్డుల్లో ప్రజలకు అవగాహన కల్పించారు.
ఊరూరా.. పల్లెప్రగతి
గుమ్మడిదల, జూలై 2: గుమ్మడిదల, కానుకుంట, రాంరెడ్డిబావి, మంభాపూర్, నల్లవల్లి తదితర గ్రామాల్లో మండల ప్రత్యేకాధికారి ప్రసాద్, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంపీపీ సద్ది ప్రవీణాభాస్కర్రెడ్డి, జడ్పీటీసీ కుమార్గౌడ్ పల్లెప్రగతిలో పాల్గొన్నారు. కొత్తపల్లి, నల్లవల్లి గ్రామాల్లో సర్పంచ్లు ఆంజనేయులు, శంకర్, ఎంపీటీసీ ప్రభాకర్రెడ్డి ఆధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. మురుగు కాలువలు పరిశుభ్రం చేయించారు. సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలి
సంగారెడ్డి మున్సిపాలిటీ, జూలై 2: ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం పట్టణ ప్రగతి, హరితహారంలో భాగంగా మున్సిపల్ పరిధిలోని 1, 2, 3, 21, 22 వార్డుల్లో వార్డు కౌన్సిలర్లు కసిని రజిని, నాయికోటి రమేశ్, విష్ణువర్ధన్, మందుల రాధాకృష్ణ, తూర్పు నిర్మల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్, మాజీ సీడీసీ చైర్మన్ విజయేందర్రెడ్డి, మున్సిపల్ మేనేజర్ మీర్జా ఫసాహత్ అలీ బేగ్, ఏఈ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
పట్టణాలు పరిశుభ్రంగా..
రామచంద్రాపురం, జూలై 2 : ఆర్సీపురం డివిజన్లోని శ్రీనివాస్నగర్లో కార్పొరేటర్ పుష్పానగేశ్ ఆధ్వర్యంలో బల్దియా సిబ్బంది డెబ్రిస్, కలుపు మొక్కలను తొలగించారు. భారతీనగర్ డివిజన్లోని ఎంఐజీలో కార్పొరేటర్ సింధూఆదర్శ్రెడ్డి ఆధ్వర్యంలో బల్దియా సిబ్బంది చెత్తాచెదారం తొలగింపు, మురుగు కాలువల శుభ్రత, తుప్పు పట్టిన కరెంట్ పోల్స్ తొలగింపు, రోడ్లపై గుంతలు పూడ్చారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి ఆధ్వర్యంలో పారిశుధ్య నివారణ చర్యలు చేపట్టారు.
పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత
కల్హేర్, జూలై 2: జడ్పీటీసీ నర్సింహారెడ్డి నాగదర్ గ్రామ శివారులోని నల్లకుంట కట్టపై 400 ఈత చెట్లు, అలీఖాన్పల్లి, మిర్కాన్పేట్ గ్రామాలల్లో వివిధ మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. ఎంపీడీవో మంజుల పల్లెప్రగతి, హరితహారం పై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీవో శ్రీనివాస్, మార్డి పీఏసీఎస్ మాజీ చైర్మన్ జలందర్, సర్పంచ్లు రవి, యాకూబ్, గ్రామ కార్యదర్శి వెంకటేశ్, మధుకర్, నాగదర్, మిర్కాన్పేట్ ఉప సర్పంచ్లు అడివప్ప, రాజు, పాల్గొన్నారు.
గ్రామాల్లో మొక్కల పంపిణీ
వట్పల్లి : నిర్జప్ల, ఉసిరికపల్లి, పల్వట్ల, నాగుపల్లి, షాద్నగర్, ఖాదిరాబాద్, కేరుర్, గొర్రెకల్ గ్రామల్లో ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో గీత, ఎంపీవో యూసుఫ్, ఏఈవో సరిత పాల్గొన్నారు.