భువనేశ్వర్ : ఒడిశా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని స్వాభిమాన్ ఆంచల్లో రెండు ఐఈడీలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మల్కాన్గిరి పోలీసులు, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సంయుక్త ఆపరేషన్ నిర్వహించి.. పేలుడు పదార్థాలను గుర్తించారు. భద్రతా దళాలే లక్ష్యంగా రచించిన కుట్రను భగ్నం చేసినట్లు బీఎస్ఎఫ్ ఒడిశా తెలిపింది. ఈ నెల ప్రారంభంలో ఇలాంటి సంఘటనలో, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), ఒడిశా పోలీసులు మూడు టిఫిన్ బ్యాంకుల్లో ఏర్పాటు చేసిన ఐఈడీలను, పేలుడు పరికరాలను మల్కాన్గిరి జిల్లాలోని మండపల్లి ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు.