ఎదులాపురం, జూలై 5 : జిల్లాకేంద్రంలోని రిమ్స్ సూపరింటెండెంట్ చాంబర్లో రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ స్టాఫ్నర్సు అభ్యర్థుల సర్టిఫికెట్లను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిమ్స్లో 220 మంది స్టాఫ్నర్సుల పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. ఎంపికైన వారు 60 రోజుల్లోగా విధుల్లో చేరాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ శ్వేత, ఉన్నారు.
పారదర్శకంగా ఇంటర్వ్యూలు
పారదర్శకంగా ఇంటర్యూలు నిర్వహిస్తున్మామని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని తన కా ర్యాలయంలో కమిటీ సమక్షంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్హెచ్ఎం పరిధిలోని వివిధ విభాగాల్లో శిశు వైద్యుడు 2, గైనకాలజిస్ట్ 1, అనస్తీషియా1, సైకియాట్రిస్ట్ 1, మెడికల్ ఆఫీసర్ 7 పోస్టులు ఉన్నాయన్నారు. మిగిలిన వారికి కూడా ఇంటర్వ్యూల తేదీలు ప్రకటిస్తామన్నారు. కమిటీ సభ్యులు రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్, డీఐవో విజయసారథి, సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రమణ, తదితరులు ఉన్నారు.