హైదరాబాద్, జూన్ 4: గాంధీ దవాఖానలో రోజుకు 0.5 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్ను అరబిందో ఫార్మా ఏర్పాటు చేసింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా దాదాపు కోటి రూపాయల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేసినట్లు అరబిందో ఫార్మా ఫౌండేషన్ అధిపతి సదానందరెడ్డి తెలిపారు. కాగా, గత రెండు రోజులుగా ఉత్పత్తి ట్రయల్ రన్స్ నిర్వహించి, అంతా పరిశీలించాకే శుక్రవారం లాంఛనంగా దవాఖాన వర్గాలకు అప్పగించినట్లు సంస్థ ప్రతినిధి సురేశ్ రామన్ వెల్లడించారు. అయినప్పటికీ మూడు నెలలపాటు ప్లాంట్ నిర్వహణ బాధ్యతలను సంస్థే చూసుకుంటుందన్నారు.