నందికొండ, ఏప్రిల్ 5 : కాంగ్రెస్ పాలనలో నాగార్జునసాగర్ను పంచాయతీ కూడా చేయలేకపోయిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం నందికొండను మున్సిపాలిటీగా మార్చి అభివృద్ధి చేస్తున్నదని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా, ఎన్నికల నందికొండ ఇన్చార్జీలు, కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు అన్నారు. 8వ వార్డులో పార్టీ ఇన్చార్జి నకిరేకంటి సైదులు, 10వ వార్డులో పార్టీ ఇన్చార్జి వెంకటనాగరాజు, 9వ వార్డులో కౌన్సిలర్ ఇర్ల రామకృష్ణ, 1వ వార్డులో కౌన్సిలర్ మంగ్తా, 5వ వార్డులో రమేశ్జీ, 3వ వార్డులో కౌన్సిలర్ నాగశిరీష, 4వ వార్డులో వైస్ చైర్మన్ మంద రఘువీర్, 6వ వార్డులో నాగరాణితో కలిసి సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఈఈ మహ్మద్ అబ్దుల్ సలీంకు టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్న బ్రహ్మానందరెడ్డి, పట్టణ కార్యదర్శి కృష్ణ, ఆదాసు విక్రమ్, మోహన్నాయక్, చంద్రమౌళి, సైదులు, శాంతకుమారి, రమణ, విజయ, మాధవి, రామస్వామి, మధు, కోదండం పాల్గొన్నారు. అనంతరం ఆర్యవైశ్యులతో శ్రీనివాస్గుప్తా సమావేశమై సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. సాగర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సాంబశివరావు, నర్సింహులు, శ్రీను, సత్యనారాయణ, శ్రీనివాస్రావు, రఘునందన్ పాల్గొన్నారు. నందికొండ పైలాన్కాలనీలో వంద మంది ఆటో యూనియన్ సభ్యులతో జీవీ రామకృష్ణారావు సమావేశం నిర్వహించి, 40మంది ఆటో డ్రైవర్లకు టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యూనియన్ అధ్యక్షుడు నజీర్, సభ్యులు చారి, మన్సూర్, చిన్న అంజయ్య, జనార్దన్, నాయకులు ఎండీ గౌస్, చాంద్పాషా, షరీఫ్, రణధీర్ పాల్గొన్నారు.పెద్దవూర : మండల కేంద్రంలోని దుర్గమాత ఆలయంలో మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్గుప్తాను సన్మానించారు. మిట్టపల్లి శ్రీనివాస్, వినోద్కుమర్, సోమ కృష్ణముర్తి పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
గడువు ముగిసినా.. తేదీ మార్చెయ్