దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ సత్తా చాటుతున్నది. కరోనా ఉద్ధృతిలోనూ ఇండ్ల అమ్మకాల్లో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో భాగ్యనగరమే టాప్గా నిలిచింది. ప్రముఖ ఆన్లైన్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్టైగర్ తాజా నివేదిక ప్రకారం గతంతో పోల్చితే ఈ ఏడాది జనవరి-మార్చిలో హైదరాబాద్ హౌజింగ్ సేల్స్ 39 శాతం పెరిగినట్టు తేలింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో వ్యాపార నిర్వహణ సులభతరంగా మారిందని, ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్కు కలిసొచ్చిందని ప్రాప్టైగర్ తమ నివేదికలో పేర్కొన్నది. నిరుడు జనవరి-మార్చిలో 5,554 ఇండ్ల విక్రయాలు జరిగితే, ఈ ఏడాది జనవరి-మార్చిలో 7,721 యూనిట్లు అమ్ముడైనట్టు పేర్కొన్నది. వీటి విలువ రూ.8,400 కోట్లని, గతేడాదితో పోల్చితే 34 శాతం ఎక్కువని పేర్కొన్నది.
హైదరాబాద్, మే 21: ఇండ్ల అమ్మకాల్లో హైదరాబాద్ దూసుకుపోతున్నది. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో భాగ్యనగరమే టాప్ అని ప్రముఖ ఆన్లైన్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్టైగర్ తమ తాజా నివేదిక ‘రియల్ ఇన్సైట్ క్యూ1-2021’లో వెల్లడించింది. గతంతో పోల్చితే ఈ ఏడాది జనవరి-మార్చిలో హైదరాబాద్ హౌజింగ్ సేల్స్ 39 శాతం పెరిగినట్లు తేలింది. నిరుడు జనవరి-మార్చిలో 5,554 ఇండ్ల విక్రయాలు జరిగితే, ఈ ఏడాది జనవరి-మార్చిలో 7,721 యూనిట్లు అమ్ముడైనట్లు పేర్కొన్నది. వీటి విలువ రూ.8,400 కోట్లని, గతేడాదితో చూస్తే 34 శాతం ఎక్కువన్నది. ఈ స్థాయిలో దేశవ్యాప్తంగా ఇతర ఏ ప్రధాన నగరాల్లో అమ్మకాలు లేవని స్పష్టం చేసింది. యావత్ మార్కెట్ను కరోనా వైరస్ షేక్ చేస్తున్నా.. హైదరాబాద్ రియల్టీపై ఆ ప్రభావం కనబడకపోవడం గమనార్హం. కొండాపూర్, కొంపల్లి, కూకట్పల్లి, నిజాంపేట్, మియాపూర్, బాచుపల్లి, సంగారెడ్డిల్లో ఇండ్లకు జోరుగా డిమాండ్ కనిపించిందని ప్రాప్టైగర్ తెలిపింది. కూకట్పల్లి, నిజాంపేట్లలో రూ.50 లక్షలలోపు ఇండ్లకు గిరాకీ ఉంటే.. కొండాపూర్, మియాపూర్, కొంపల్లిల్లో రూ.50 లక్షలు-కోటి రూపాయల మధ్య డిమాండ్ వ్యక్తమవుతున్నది.
‘వ్యాపారాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు బాగున్నాయి. ముఖ్యంగా టీ-ఐపాస్, ఐసీటీ పాలసీలు వ్యాపార నిర్వహణను సులభతరం చేశాయి. అందువల్లే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కు కొత్త ఉత్సాహం వచ్చింది’తాజా నివేదికలో ప్రాప్టైగర్