న్యూఢిల్లీ: కోవిషీల్డ్ వ్యాక్సిన్ల ఉత్పత్తి విషయమై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)పై ఆస్ట్రా జెనెకా ఆగ్రహంతో ఉంది. టీకాల ఉత్పత్తిలో జాప్యానికి కారణాలేమిటని సీరం సంస్థకు ఆస్ట్రాజెనిక్ నోటీస్ జారీ చేసింది. ఈ సంగతి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) వెల్లడించింది.
తమతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కోవిషీల్డ్ను సరఫరా చేయడంలో జరుగుతున్న జాప్యానికి కారణాలేమిటో తెలపాలని ఆస్ట్రాజెనికా తమను ప్రశ్నించిందని ఎస్ఐఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) అదర్ పూనావాలా చెప్పారు. తమకు నోటీసు వచ్చిన విషయమై కేంద్ర ప్రభుత్వానికి కూడా సమాచారం తెలుసన్నారు.
ఆస్ట్రా జెనికా జారీ చేసిన నోటీసుపై ఇప్పుడే వ్యాఖ్యానించలేనని, వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామని అదర్ పూనావాల వెల్లడించారు. భారత్లో సరఫరా చేయాల్సిన డోసులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఆస్ట్రాజెనెకాకు సరఫరా చేయాల్సిన టీకా డోసుల్లో జాప్యం నెలకొన్నదని ఒక పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పూనావాలా తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా తమ టీకాకు డిమాండ్ ఉందని, భారత దేశ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నా.. అవసరమైన భారతీయులందరికీ టీకాను అందజేయలేమని పూనావాలా స్పష్టం చేశారు. విదేశాల్లో టీకా డోసు ధర కూడా ఎక్కువగా ఉందన్నారు.
ఎస్ఐఐ నెలకు ఆరు కోట్ల నుంచి ఆరున్నర కోట్ల టీకాలను ఉత్పత్తి చేస్తోందని పూనావాలా తెలిపారు. ఇప్పటివరకు 10 కోట్ల డోసులను కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేశామని, మరో 6 కోట్ల డోసులను విదేశాలకు ఎగుమతి చేశామని వివరించారు.
ఏసీలు, ఎల్ఈడీ లైట్ల కోసం పీఎల్ఐ పథకం
మహీంద్రాతో ఫ్లిప్కార్ట్ డీల్
హోంలోన్ కావాలా.. టాప్ 10 ప్రైవేట్ బ్యాంకుల్లో ఇలా బెస్ట్
ముకేశ్పై ఫైన్కు వ్యతిరేకంగా శాట్కు రిలయన్స్!