జూన్ నెలతో ముగిసిన తొలి త్రైమాసికంలో దేశీయ పెయింట్ సంస్థ ఏషియన్ పెయింట్స్ అదరగొట్టింది. మంగళవారం విడుదల చేసిన తొలి త్రైమాసికం ఫలితాల్లో ఏషియన్ పెయింట్స్ లాభాలు సాధించింది. ఈ కంపెనీ లాభాలు 161 శాతం పెరిగి రూ.570 కోట్లకు చేరుకున్నది. ఆదాయం కూడా 91 శాతం పెరిగింది.
ఏప్రిల్-జూన్ కాలంలో ఏషియన్ పెయింట్స్ కంపెనీ రూ.570 కోట్ల ఏకీకృత లాభం పొందింది. అంతకుముందు త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.218 కోట్లు. మొదటి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.5,580 కోట్లుగా ఉండగా, ఏడాది క్రితం ఇది రూ.2,925 కోట్లు. ఎక్స్ఛేంజ్ డాటా ప్రకారం, ఏషియన్ పెయింట్స్ ఇబీఐటీడీఏ రూ.484 కోట్ల నుంచి రూ.1,200 కోట్లకు పెరిగింది. ఈబీఐటీడీఏ మార్జిన్ కూడా 16.5 శాతం వైఓవై నుంచి 21.7 శాతానికి పెరిగింది. కంపెనీ పెయింట్ వ్యాపార ఆదాయం 90.4 శాతం పెరిగి రూ.5,464.7 కోట్లకు చేరుకున్నది. అంతకు ముందు ఏడాది త్రైమాసికంలో రూ.2,870.6 కోట్లు సాధించింది. పెయింట్ వ్యాపారం ఏబీఐటీ కూడా రూ.371.6 కోట్ల నుంచి రూ.809.1 కోట్లకు పెరిగింది. మార్జిన్లు కూడా గత ఏడాది 12.9 శాతం నుండి 14.8 శాతానికి పెరిగాయి.
ఆకాశంలో బర్త్డే, పెండ్లి రోజు ఫంక్షన్లు..! ఎక్కడంటే?
ఇంట్లో ఫోన్ మర్చిపోయారా..? డోంట్వర్రీ కారు ఉందిగా..!
భారత్తో సంబంధాలు కోరుకుంటున్నాం: నేపాల్ ప్రధాని డ్యూబా
మెక్సికో మాజీ అధ్యక్షులపై ఆగస్టు 1 న రెఫరెండం
సిద్ధమైన 3 డీ ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..?
నటి కరీనా కపూర్ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’పై ఫిర్యాదు
చరిత్రలో ఈరోజు.. విభజించు పాలించు ప్రారంభం
ఈ వ్యాయామం రోజూ చేస్తే రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు.. ఏంటది?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..