హైదరాబాద్, సెప్టెంబర్ 7: ప్రముఖ టైల్స్ తయారీ సంస్థ ఆసియన్ గ్రానిటో రైట్స్ ఇష్యూ ఈ నెల 23న ప్రారంభంకాబోతున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల7న ముగియనున్న ఈ రైట్స్ ఇష్యూ ద్వారా రూ.224.65 కోట్ల నిధులను సమీకరించాలనుకుంటున్నది. ఇష్యూ ధరను షేరు ఒక్కింటికి రూ.100గా నిర్ణయించింది. వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి, రుణాలను తీర్చడానికి ఈ నిధులను వినియోగించనున్నట్లు ప్రకటించింది.