హైదరాబాద్ : ఎంటర్టైన్మెంట్ టీవీ ఛానల్ను ఏమార్చిన మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. కరోనా టీకా పేరుతో నాగార్జున రెడ్డి అనే వ్యక్తి ఓ టీవీ ఛానల్కు ఫోన్ చేసి రూ. 100 కు టీకా వేస్తామన్నాడు. మంత్రి కేటీఆర్ కార్యాలయం నుండి మాట్లాడుతున్నట్లు తెలిపాడు. ఇది నమ్మిన టీవీ ఛానల్ యాజమాన్యం 1500 మందికి టీకాల కోసం లక్షన్నర రూపాయలు చెల్లించింది. డబ్బులు చెల్లించాక స్పందన లేకపోవడంతో బాధిత యాజమాన్యం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.