హైదరాబాద్, జూన్ 21: బిల్డింగ్ మెటీరియల్స్ సంస్థ అపర్ణ ఎంటర్ప్రైజెస్.. రాబోయే నాలుగేండ్లలో తమ అల్యూమినియం విండో, డోర్ సిస్టమ్ బ్రాండ్ అల్టెజాలో రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తాజాగా ప్రకటించింది. ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో బలోపేతానికి ఈ నిధులను వినియోగిస్తామని ఈ సందర్భంగా సంస్థ ఎండీ అశ్విన్ రెడ్డి తెలిపారు. తయారీ కేంద్రం, మార్కెటింగ్, రిటైలింగ్ వ్యవస్థలను మరింత మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. కాగా, కొత్త గా స్లిమ్ అల్యూమినియం ైస్లెడింగ్ డోర్ సిస్టమ్ ఏసీఏ ఎం-19 సిరీస్ను ఆవిష్కరించినట్లు చెప్పారు. 2025 నాటికి సంస్థాగత అల్యూమినియం డోర్, విండో మా ర్కెట్లో అల్టెజా 8-10 శాతం వా టాను అందుకోగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇదిలావుంటే ఈ ఏడా ది ఆఖరుకల్లా 100 మందికిపైగా ఉద్యోగాల్లోకి తీసుకోనున్నామని, వీరిలో ఎక్కువమంది తెలంగాణవారేనని అశ్విన్ రెడ్డి వెల్లడించారు.