కాళేశ్వరం ప్రాజెక్ట్ మరో చరిత్ర సృష్టించింది. కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీ వాగు లోకి గోదావరి జలాలను తరలించే అద్భుత ఘట్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఆవిష్కరించారు. సంగారెడ్డి కాల్వ అప్టేక్ తూము గేట్లను ఎత్తి హల్దీ వాగు లోకి కాళేశ్వర జలాలను వదిలిపెట్టారు. గోదావరి జలాలు చెరువుల్లోకి చేరడంతో సంగారెడ్డి జిల్లా రైతుల సంతోషం పట్టరాకుండా మారింది. చెరువంతా గోదావరి నీరు పారుతూ గంటగంటకు నీటిమట్టం పెరుగుతుంటే రైతులు, ప్రజలు సంబురాలు చేసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కన్నీరు కారిన చోటే.. గంగమ్మ పరవళ్లు..
గోదారి జలాలు వచ్చె.. రైతన్న మురిసె..