న్యూఢిల్లీ, జూన్ 30: అమూల్ పాల ధరలు గురువారం నుంచి పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా లీటర్ పాల ధరను రూ.2 పెంచుతున్నట్లు బుధవారం గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్య ప్రకటించింది. పెరిగిన ఉత్పాదక వ్యయమే ధరల పెంపునకు కారణమని ఈ సందర్భంగా సంస్థ స్పష్టం చేసింది. నిజానికి ఏడాదిన్నర నుంచి ధరలను పెంచలేదని గుర్తుచేసిన కంపెనీ.. ప్యాకేజింగ్, రవాణా, విద్యుత్తుసహా సంస్థాగత ఖర్చుల భారం పెరిగిపోవడంతో ఇక తప్పట్లేదని వివరించింది. కాగా, ప్రస్తుతం ప్రతిరోజూ 150 లక్షల లీటర్ల అమూల్ పాలు అమ్ముడవుతున్నాయి.